Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ 7 ఫినాలే గెస్టులుగా.. మ‌హేశ్‌బాబు, బాల‌కృష్ణ‌?

ABN , First Publish Date - 2023-12-15T22:02:39+05:30 IST

గ‌డిచిన 90 రోజులుగా టీవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న బిగ్‌బాస్‌7 ఉల్టా ప‌ల్టా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఫినాలే కార్య‌క్ర‌మానికి టాలీవుడ్ ఫ్రిన్స్ మ‌హేశ్‌బాబు ముఖ్య అతిథిగా హ‌జ‌రు కానున్నట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ 7 ఫినాలే గెస్టులుగా.. మ‌హేశ్‌బాబు, బాల‌కృష్ణ‌?
BBT

గ‌డిచిన 90 రోజులుగా టీవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న బిగ్‌బాస్‌7 (Bigg Boss Telugu 7) ఉల్టా ప‌ల్టా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది ఇప్ప‌టికే ఆరు సీజ‌న్లుగా వ‌చ్చి ఒక‌దాన్ని మించి మ‌రోటి విజ‌యం సాధించాయి. మూడు నెల‌ల క్రితం సెప్టెంబ‌ర్‌3న ప్రారంభ‌మైన 7వ సీజ‌న్‌కు ఈ ఆదివారంతో శుభం కార్డ్ వేయ‌నున్నారు. ఈనెల 17న ఫినాలే కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి టాలీవుడ్ ఫ్రిన్స్ మ‌హేశ్‌బాబు(MaheshBabu) ముఖ్య అతిథిగా హ‌జ‌రు కానున్నారు. ఈ మేర‌కు అధికారికంగా మేక‌ర్స్‌ ప్ర‌క‌టించారు.

అయితే గత బిగ్‌బాస్ సీజన్‌6కు ఎలాంటి గెస్ట్ లేకుండానే నాగార్జునే విజేతను ప్రకటించ‌గా అంతకు ముందు రెండు సీజన్లకు మెగాస్టార్ చిరంజీవి, ఒక సీజ‌న్‌కు విక్టరీ వెంకటేష్ అతిథులుగా వచ్చి విన్న‌ర్స్‌కు ట్రోఫీ అంద‌జేశారు. కాగా ప్రస్తుత సీజ‌న్7 మిగ‌తా సీజ‌న్ల క‌న్నా మంచి విజ‌యం సాధించ‌డంతో టాలీవుడ్ నుంచి పెద్ద స్టార్‌ను గెస్ట్‌గా ఆహ్వానించారు. అదేవిధంగా త్రివిక్ర‌మ్‌, మ‌హేశ్‌బాబు (Mahesh Babu) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న గుంటూరుకారం(Guntur Kaaram) సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని 2024 జ‌న‌వ‌రి సంక్రాంతి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈక్ర‌మంలో బిగ్‌బాస్ షోలో పాల్గొని అ చిత్ర ప్ర‌మోష‌న్‌ను కూడా ప్రారంభించ‌నున్నారు.


బిగ్ బాస్ సీజన్ 7 (BiggBoss Telugu7 Grand Finale) ఉల్టా పుల్టా పేరుతో స‌రికొత్త కాన్సెస్ట్ అంటూ స‌రికొత్త‌గా వ‌చ్చిన ఈ సీజ‌న్‌పై బిగ్‌బాస్ టీం క్రియేటివ్‌గా వ్య‌వ‌హ‌రించింది. కంటెస్టెంట్స్ ద‌గ్గ‌రి నుంచి టాస్క్‌లు, నామినేషన్స్‌, ఎలిమినేషన్స్ ల విష‌యంలో వినూత్నంగా వ్య‌వ‌హ‌రించి చూసే ప్రేక్ష‌కుల‌కు రోటీన్ అని అనిపించ‌కుంగడా, బోర్ కొట్ట‌కుండా చేసిన‌ మార్పులు బాగా క‌లిసొచ్చాయి. ఓటింగ్‌లోనూ బారీ మార్పు తీసుకురావ‌డం కూడా షో విజ‌యంలో పాత్ర పోషించింది. ఇదిలాఉండ‌గా బిగ్‌బాస్‌ విన్నర్‌కు రూ.50 లక్షల ఫ్రైజ్ మనీతో పాటు ఓ బ్రీజా కారు, జాయ్ అలుక్కాస్ నుంచి 15 లక్షలు అందనున్నాయని తెలుస్తోంది. ఓ ఫ్లాటుతో క‌లిపి విన్నర్‌కు దాదాపు రూ. 90 ల‌క్ష‌ల‌ నుంచి రూ.కోటి వరకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సారి బిగ్‌బాస్‌7(Bigg Boss Telugu7 Grand Finale)లో ఫైన‌లిస్టులుగా ఉన్న శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్‌ల‌లో ఒక‌రు ట్రోఫీని గెలుచుకోనున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటింగ్ ప‌ర్సంటేజ్ రైతుబిడ్డ ప్ర‌శాంత్‌కు ఎక్కువ‌గా ఉంద‌ని దాదాపు అత‌నే విన్న‌ర్ అంటూ నెట్టింట పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌య‌మేమంటే ఈ షోకు మ‌హేశ్‌బాబు (MaheshBabu) ఒక్క‌డే కాకుండా బాల‌కృష్ణ‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాబోతున్నారంటూ స‌మాచారం ఉంది.

Updated Date - 2023-12-15T22:10:44+05:30 IST