Shruti Haasan: ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ లకు శ్రుతి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందా..?

ABN , First Publish Date - 2023-01-24T18:26:16+05:30 IST

కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ శ్రుతి హాసన్ (Shruti Haasan). ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ అందాల భామ నుంచి తాజాగా రెండు సినిమాలు వచ్చాయి.

Shruti Haasan:  ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ లకు శ్రుతి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందా..?

కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ శ్రుతి హాసన్ (Shruti Haasan). ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ అందాల భామ నుంచి తాజాగా రెండు సినిమాలు వచ్చాయి. బాలకృష్ణ సరసన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy), మెగాస్టార్ చిరంజీవికీ జోడీగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లో నటించింది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ఒక్క రోజు వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. దాదాపుగా రూ.300కోట్ల వసూళ్లను రాబట్టాయి. ఈ సినిమాలకు గాను శ్రుతి హాసన్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ నగర్‌లో రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ రెండు సినిమాల్లో నటించేందుకు శ్రుతి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందట. దాదాపుగా రూ.5కోట్ల రెమ్యూనరేషన్‌‌తో పాటు జీఎస్‌టీని మైత్రీ మూవీ మేకర్స్ చెల్లించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక శ్రుతి హాసన్ కెరీర్ కెరీర్ విషయనికి వస్తే.. ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ‘సలార్’ (Salaar) లో హీరోయిన్ పాత్రను చేస్తుంది. ఈ చిత్రానికీ ప్రశాంత్ నీల్ (Prashant Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

Updated Date - 2023-01-24T18:26:52+05:30 IST