యాద్గిరి, ఆయన కొడుకులు ఏం చేశారు?

ABN , First Publish Date - 2023-05-03T01:54:05+05:30 IST

కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అనిరుధ్‌, యశస్విని జంటగా రూపుదిద్దుకున్న ‘యాద్గిరి అండ్‌ సన్స్‌’ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. భిక్షపతిరాజు దర్శకత్వంలో చంద్రకళ ఈ సినిమాను...

యాద్గిరి, ఆయన కొడుకులు ఏం చేశారు?

కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అనిరుధ్‌, యశస్విని జంటగా రూపుదిద్దుకున్న ‘యాద్గిరి అండ్‌ సన్స్‌’ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. భిక్షపతిరాజు దర్శకత్వంలో చంద్రకళ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకకు ‘భీమ్లా నాయక్‌’ దర్శకుడు సాగర్‌ కె.చంద్ర ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్‌ చాలా బాగుంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. మంచి ప్రయత్నాన్ని, చిత్రాన్ని ప్రోత్సహించాలి’ అన్నారు. ఇదే తన తొలి సినిమా అనీ, చిత్రంలో అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయనీ హీరో అనిరుధ్‌ చెప్పారు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఇంట్లో జరిగే అవకాశం ఉందనీ, అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ చిత్రంలో చూపించినట్లు నటుడు రోహిత్‌ చెప్పారు. ‘ఒక మంచి సినిమాను అందరి సహకారంతో అనుకున్న విధంగా , అనుకున్న టైమ్‌లో తీయగలిగాం. మే 5న విడుదల చేయబోతున్నాం’ అని చెప్పారు దర్శకుడు భిక్షపతి రాజు.

Updated Date - 2023-05-03T01:54:05+05:30 IST