లాస్ ఏంజిల్స్లో శిక్షణ తీసుకొన్నా
ABN , First Publish Date - 2023-01-30T00:34:40+05:30 IST
‘రోజులు మారాయి’, ‘గల్ఫ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ చిత్రాలతో ఆకట్టుకొన్న నటుడు చేతన్ మద్దినేని...
‘రోజులు మారాయి’, ‘గల్ఫ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ చిత్రాలతో ఆకట్టుకొన్న నటుడు చేతన్ మద్దినేని. ప్రస్తుతం నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయి కిశోర్ దర్శకుడు. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఆదివారం చేతన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కోవిడ్ తరవాత చాలా గ్యాప్ తీసుకొన్నా. ఈ విరామంలో లాస్ ఏంజిల్స్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకొని తిరిగొచ్చా. రాగానే ఓ మంచి కథ విన్నాను. ‘ఢీ’, ‘రెడీ’ తరహాలో వినోదాత్మకంగా సాగే కథ ఇది. తప్పకుండా అలరిస్తుంది. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తామ’’న్నారు.