ముహూర్తం కుదిరింది

ABN , First Publish Date - 2023-10-27T01:29:40+05:30 IST

టాలీవుడ్‌ యువ హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి వివాహానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ 1న ఈ ప్రేమజంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు...

ముహూర్తం కుదిరింది

టాలీవుడ్‌ యువ హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి వివాహానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ 1న ఈ ప్రేమజంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. ఇటలీలోని టుస్కానీ ఈ వేడుకకు వేదిక కానుంది. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్‌ పీఆర్‌ బృందం సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిమంది మాత్రమే పెళ్లికి హాజరవుతున్నారు. సినీ ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ‘మిస్టర్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో వరుణ్‌, లావణ్య తొలిసారి ఇటలీలోనే కలుసుకున్నారు. దాన్ని సెంటిమెంట్‌గా భావించి ఇప్పుడు పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకుంటున్నారు.

Updated Date - 2023-10-27T01:29:40+05:30 IST