Sumanth: ‘వారాహి’ వచ్చేలా.. సుమంత్‌ చిత్రానికి ఆసక్తికర టైటిల్

ABN , First Publish Date - 2023-11-15T17:13:22+05:30 IST

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ప్రొడక్షన్‌ నెంబర్ 2 చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు, విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో ఈ చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించింది.

Sumanth: ‘వారాహి’ వచ్చేలా.. సుమంత్‌ చిత్రానికి ఆసక్తికర టైటిల్

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ప్రొడక్షన్‌ నెంబర్ 2 చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు, విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో ఈ చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Vaarahi) అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించింది. హీరో సుమంత్‌ (Sumanth), హీరోయిన్‌ మీనాక్షి (Meenakshi), చిత్ర దర్శకుడు జాగర్లపూడి సంతోష్‌.. నిర్మాతలు కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి తదితరులు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిశారు. రాజశ్యామల అమ్మవారితో వారాహి అమ్మవారికి ఉన్న అనుబంధం గురించి చిత్ర బృందం స్వాత్మానందేంద్ర స్వామిని అడిగి తెలుసుకుంది. (Mahendragiri Vaarahi Title Announcement)

ఈ సందర్భంగా దర్శకుడు జాగర్లపూడి సంతోష్ (Jagarlapudi Santhosh) మాట్లాడుతూ.. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మహేంద్రగిరి వారాహి చిత్రానికి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి చిత్రబృందం కలిసి వచ్చాం. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోంది.. రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఆలయం విశాఖ శారదాపీఠంలోనే ఉన్నందున అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చాం. ఈ ఏడాది జూన్‌ నెలలో షూటింగ్‌ ప్రారంభించాం, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర ఇతివృత్తాన్ని స్వరూపానందేంద్ర స్వామికి వివరించి ఆశీస్సులు అందుకున్నామని అన్నారు.


Mahendragiri-Vaarahi.jpg

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌‌లో చిత్రీకరిస్తున్న సినిమాల్లో ‘మహేంద్రగిరి వారాహి’ రెండవ చిత్రమని నిర్మాత కాలిపు మధు (Kalipu Madhu), ఎం సుబ్బారెడ్డి (M Subbareddy) తెలిపారు. రాజశ్యామలని నిత్యం ఉపాసించే తాను అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం ఇక్కడకు రావడం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.. చిత్రం విజయవంతమైన అనంతరం మళ్ళీ విశాఖ శారదాపీఠాన్ని సందర్శిస్తామని పేర్కొన్నారు. చిత్ర బృందాన్ని పీఠాధిపతులు శాలువాతో సత్కరించారు.


ఇవి కూడా చదవండి:

========================

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..

**********************************

*Mehreen Pirzada: అదే నాకు ‘స్పార్క్’ మూమెంట్‌..

**********************************

*Malavika Mohanan: అభిమానుల మనసుల్లో మాళవిక గిలిగింతలు

********************************

*Aishwarya Rai: ఐష్ టాయిలెట్స్ కడగడానికి కూడా ఆ క్రికెటర్ పనికిరాడంటూ.. నెటిజన్లు ఫైర్

*********************************

Updated Date - 2023-11-15T17:13:23+05:30 IST