ఏమిటా ‘శబ్దం’
ABN , First Publish Date - 2023-03-11T00:22:33+05:30 IST
ఆది పినిశెట్టి కథానాయకుడిగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘శబ్దం’. లక్ష్మీ మీనన్ కథానాయిక. అరివళగన్ దర్శకుడు.

ఆది పినిశెట్టి కథానాయకుడిగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘శబ్దం’. లక్ష్మీ మీనన్ కథానాయిక. అరివళగన్ దర్శకుడు. 7జీ శివ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్న ఈ చిత్రంలో లైలా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. లైలా లుక్కి సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేసింది. ‘‘అందాల కథానాయిక లైలా తెలుగు వాళ్లందరికీ పరిచయమే. ఆమె ఇది వరకెప్పుడూ చేయని పాత్ర ఇది. తన నటన, పాత్ర చిత్రణ అనూహ్యంగా ఉంటాయ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: తమన్.