ఒంటరిగా అస్సలు చూడొద్దు!
ABN , First Publish Date - 2023-11-20T00:46:02+05:30 IST
శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. సాయి కిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం...

శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. సాయి కిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబరు 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్ని భయపెట్టడమే లక్ష్యంగా ఈ సినిమా తీర్చిదిద్దాం. ఒంటరిగా ఈ సినిమా అస్సలు చూడొద్దు. ప్రతీ క్షణం ఒళ్లు జలదరించేలా ఉంటుంద’’న్నారు. సంగీతం: కృష్ణ సౌరభ్ మారంపల్లి.