మామా మశ్చీంద్ర... ముహూర్తం కుదిరింది
ABN , First Publish Date - 2023-09-08T02:03:54+05:30 IST
సుధీర్బాబు హీరోగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు...

సుధీర్బాబు హీరోగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. గురువారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో స్థూలకాయుడు దుర్గ, డాన్ పర శురాం, డీజేగా మూడు లుక్స్లో ఆయన ఆకట్టుకున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో మిర్నాళిని రవి, ఈషారెబ్బా కథానాయికలుగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.