Milestone Movie : మైల్‌స్టోన్‌ మూవీ అవుతుంది

ABN , First Publish Date - 2023-02-01T23:27:38+05:30 IST

హీరో సందీప్‌ కిషన్‌ నటించిన రొమాంటిక్‌, యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీ ‘మైఖేల్‌’ ఈ శుక్రవారం విడుదల కానుంది...

Milestone Movie : మైల్‌స్టోన్‌ మూవీ అవుతుంది

హీరో సందీప్‌ కిషన్‌ నటించిన రొమాంటిక్‌, యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీ ‘మైఖేల్‌’ ఈ శుక్రవారం విడుదల కానుంది. రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు హీరో నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘కష్టం, ప్రతిభ, అదృష్టం .. ఈ మూడు కలిసి వస్తే చాలు ఎవరైనా టాప్‌ పొజిషన్‌కు వెళతారు. సందీ్‌పలో కష్టం, ప్రతిభ ఉన్నాయి కానీ అదృష్టం కనిపించలేదు. ‘మైఖేల్‌’ చిత్రంతో అది మొదలవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, విజువల్స్‌ చూస్తే కొత్త ఒరవడి మొదలవుతుందని అనిపించింది. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ‘శివ’ చిత్రం మిగిలిన వాటికి భిన్నంగా అనిపించింది. అలాగే ‘మైఖేల్‌’ మైల్‌స్టోన్‌ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రంజిత్‌ కొత్తగా తీశాడు’ అని అభినందించారు నాని.

‘నాని, నేను కెరీర్‌ బిగినింగ్‌ నుంచి స్నేహితులం. కానీ నా సినిమా వేడుకకి నాని రావడం ఇదే మొదటి సారి. నాకు ‘మైఖేల్‌’ స్పెషల్‌ మూవీ. నాని ఈ వేడుకకి రావడంతో మరింత స్పెషల్‌ అయింది. నేను ఏదైతే చేయలేనని అనుకున్నారో అన్నీ ఈ సినిమాలో చేశాను. ఈ చిత్రం మీద ప్రత్యేక ప్రేమ చూపించిన విజయ్‌ సేతుపతికి ఽధన్యవాదాలు చెబితే సరిపోదు. మా గురువు గౌతమ్‌ మీనన్‌ ఇందులో నటించడం ఇంకా స్పెషల్‌. ట్రైలర్‌కి, టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని చెప్పారు సందీప్‌ కిషన్‌. ఈ చిత్రంలో కొత్తగా కనిపించబోతున్నట్లు వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. కథని, తనని నమ్మి సినిమా తీసిన నిర్మాతలకు, హీరో సందీప్‌ కిషన్‌కు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు రంజిత్‌. ‘ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేస్తున్నాం’ అని నిర్మాత భరత్‌ చౌదరి చెప్పగా, ‘సందీ్‌పకు ఇది బిగ్గెస్ట్‌ సినిమా. దేశంలో 15 వందల థియేటర్లలో విడుదల చేస్తున్నాం. హిందీలోనే 500 థియేటర్లు ఉంటాయి’ అని పుస్కుర్‌ రామ్‌మోహన్‌ రావు చెప్పారు.

Updated Date - 2023-02-01T23:28:02+05:30 IST