రోజా ఎవరో తెలీదు..

ABN , First Publish Date - 2023-09-06T03:25:44+05:30 IST

తాను అసలు సిసలైన దేశ భక్తురాలినని, అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రకటించారు. పి.వాసు దర్శకత్వంలో నిర్మాత సుభాస్కరన్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘చంద్రముఖి-2’ చిత్రం ఈ నెల 15న...

రోజా ఎవరో తెలీదు..

తాను అసలు సిసలైన దేశ భక్తురాలినని, అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రకటించారు. పి.వాసు దర్శకత్వంలో నిర్మాత సుభాస్కరన్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘చంద్రముఖి-2’ చిత్రం ఈ నెల 15న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం చెన్నైలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. తాను దేశ భక్తురాలినని, అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ పర్యాటకశాఖ మంత్రి, నటి రోజా చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘‘రోజా అంటే ఎవరు? అలాంటివారు ఉన్నారన్న విషయమే నాకు తెలియదు. ఆమె గురించి నేనేం మాట్లాడతాను?’’ అన్నారు.

ఆంధ్రజ్యోతి, చెన్నై

Updated Date - 2023-09-06T03:25:44+05:30 IST