మార్చిలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’
ABN , First Publish Date - 2023-11-28T06:10:46+05:30 IST
విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది...
విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకుడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వచ్చే యేడాది మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటిచింది. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ యువకుడి కథ ఇది. గోదావరి నేపథ్యంలో సాగుతుంది. అక్కడ జరిగే చీకటి వ్యాపారాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చే ఓ ఫిక్షన్ స్టోరీ ఇది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన తొలి గీతానికి మంచి స్పందన వస్తోంద’’న్నారు నిర్మాతలు.