కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
ABN, First Publish Date - 2023-06-19T01:12:01+05:30
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆదివారం కన్నుమూశారు. వారం క్రితం వైజాగ్లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో వడదెబ్బతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు...
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆదివారం కన్నుమూశారు. వారం క్రితం వైజాగ్లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో వడదెబ్బతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కారణంగా అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. గాంధీ ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాకేశ్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు. తిరుపతి ఆయన సొంతూరు. బుల్లితెరపై ‘ఆట’ షోతో రాకేశ్ మాస్టర్ డ్యాన్సర్గా తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 1500 సినిమాలకు ఆయన డ్యాన్స్ మాస్టర్గా పనిచేశారు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు శేఖర్, జానీ ఆయన శిష్యులే. అనారోగ్యంతో కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. యూట్యూబ్లో వివాదాస్పద ఇంటర్వ్యూలు, సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలో ఫేమస్ ఆయ్యారు.