సంగీత దర ్శకురాలిగా ఏ.ఆర్.రెహ్మాన్ సోదరి ఇష్రత్ ఖాదరి
ABN , First Publish Date - 2023-01-18T01:31:41+05:30 IST
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్.రెహ్మాన్ సోదరి ఇష్రత్ ఖాదరి సంగీత దర ్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘ఎందయుం తాయుం.. వందేమాతరం’ పేరుతో...

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్.రెహ్మాన్ సోదరి ఇష్రత్ ఖాదరి సంగీత దర ్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘ఎందయుం తాయుం.. వందేమాతరం’ పేరుతో ఆమె ఒక ఆల్బమ్ సాంగ్ను రూపొందించారు. స్టార్ హీరో విజయ్ నటించిన ‘మదుర’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్.మాదేష్ ఈ ఆల్బమ్ సాంగ్ను అద్భుతంగా తెరకెక్కించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆల్బమ్ సాంగ్కు ఇష్రత్ స్వయంగా స్వరాలు సమకూర్చడమే కాకుండా నేపథ్యగానం కూడా చేశారు. ఇష్రత్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘మహాకవి భారతీయార్ కవిత్వంలోని కొన్ని పదాలను తీసుకుని ఈ పాటకు గేయరచన చేశాం. మన దేశ ప్రత్యేకతను చాటి చెప్పేలా ఉంటుంది. ఈ దేశం నాకు ఎంతో చేసింది. తిరిగి నేను ఈ దేశానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ పాటను చిత్రీకరించాం. ఇపుడు ఒక చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. చిత్రపరిశ్రమలో సంగీత దర్శకురాలిగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. ప్రతి ఒక్కరూ ఆదరించాలి’ అని కోరారు.
ఆంధ్రజ్యోతి,( చెన్నై)