సరికొత్త మర్డర్‌ మిస్టరీ

ABN , First Publish Date - 2023-11-29T01:01:53+05:30 IST

నిర్మాత మోహన్‌ వడ్లపట్ల దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘ఎమ్‌4ఎమ్‌’ (మోటీవ్‌ ఫర్‌ మర్డర్‌). సంబీత్‌ ఆచార్య, జోశర్మ జంటగా నటించారు...

సరికొత్త మర్డర్‌ మిస్టరీ

నిర్మాత మోహన్‌ వడ్లపట్ల దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘ఎమ్‌4ఎమ్‌’ (మోటీవ్‌ ఫర్‌ మర్డర్‌). సంబీత్‌ ఆచార్య, జోశర్మ జంటగా నటించారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్‌, జో శర్మ మెక్విన్‌ గ్రూప్‌ సంయుక్తంగా నిర్మించాయి. మంగళవారం హైదరాబాద్‌లో నిర్మాత దిల్‌ రాజు చేతుల మీదుగా టీజర్‌ విడుదలైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. మంచి చిత్రాలకు తప్పకుండా ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాల’’ని ఆకాంక్షించారు. ఎం.ఆర్‌.సి.చౌదరి మాట్లాడుతూ ‘‘డబ్బులున్నాయి కదా అని తీస్తున్న సినిమా కాదు. ఓ మంచి సినిమా చేయాలన్న ఆశయంతో తీస్తున్నాం. ఈ ప్రయాణంలో 20 - 30 కథలు విన్నాం. ‘ఎమ్‌4 ఎమ్‌’ అనేది ఓ సరికొత్త మర్డర్‌ మిస్టరీ’’ అన్నారు. ‘‘టీమ్‌ అంతా చక్కగా పని చేసింది. మేమంతా కలిసి ఓ మంచి సినిమా తీశామని నమ్ముతున్నామ’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-11-29T01:01:56+05:30 IST