ప్రతిభావంతుల కలయిక
ABN , First Publish Date - 2023-10-27T01:21:45+05:30 IST
రజత్ రాఘవ్, ఊశ్వర్య రాజ్ జంటగా రాజు గుడి గంట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. సువర్ణ రాజు దాసరి నిర్మాత...

రజత్ రాఘవ్, ఊశ్వర్య రాజ్ జంటగా రాజు గుడి గంట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. సువర్ణ రాజు దాసరి నిర్మాత. గురువారం ఉదయం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘మహర్ యోధ్ 1818’ అనే పేరు ఖరారు చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రతిభావంతుల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. మహా - శశాంక్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ’’ అన్నారు.