Vaarasudu: గ్రౌండ్‌లో ఎంత మంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు.. కానీ?

ABN , First Publish Date - 2023-01-04T19:38:55+05:30 IST

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించిన సినిమా ‘వారిసు’ (Varisu). కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా నటించాడు. రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.

Vaarasudu: గ్రౌండ్‌లో ఎంత మంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు.. కానీ?
Hero Vijay In Vaarasudu Movie

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించిన సినిమా ‘వారిసు’ (Varisu). కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా నటించాడు. రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ‘వారసుడు’ రూపొందినట్టు తెలుస్తోంది. ‘ఇల్లు అంటే ఇసుక, ఇటుకరా.. కుటుంబం అలా కాదురా’ అని జయసుధ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. విజయ్ నుంచి అభిమానులు కోరుకునే అంశాలకు కూడా చోటిచ్చారు. డైలాగ్స్ అలరించాయి. తమన్ మ్యూజిక్ అబ్బురపరిచింది. విలన్‌గా ప్రకాష్ రాజ్ మెస్మరైజ్ చేశాడు. ‘గ్రౌండ్‌లో ప్లేయర్స్ ఎంత మంది అయిన ఉండొచ్చు.. ఆడియన్స్ మాత్రం ఒక్కడినే చూస్తారు’ అని పంచ్ డైలాగ్‌‌ థియేటర్స్‌లో ఈలలు వేసేలా ఉంది. ‘వారసుడు’ లో శరత్ కుమార్, జయసుధ, సంగీత, కిక్ శ్యామ్, శ్రీకాంత్, యోగిబాబు, ప్రకాష్ రాజ్, ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘వారసుడు’ ట్రైలర్ విడుదల చేసినప్పటికీ రిలీజ్ డేట్‌ను మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ‘తెగింపు’ నిర్మాతలు కూడా విడుదల తేదీని వెల్లడించలేదు. ఐదు చిత్రాలు టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో నిలిచాయి. ‘వారసుడు’ తో పాటు, ‘తెగింపు’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’, ‘కళ్యాణం కమనీయం’ చిత్రాలు విడుదల కానున్నాయి.

Updated Date - 2023-01-04T19:52:39+05:30 IST