Adah Sharma : షూటింగ్‌ స్పాట్‌లో దెబ్బలతో.. ఫొటోలు వైరల్‌

ABN , First Publish Date - 2023-06-02T18:53:17+05:30 IST

సినిమా షూటింగ్‌ అంటే తారలు ఎండా, వాన, వేడి, చలి లెక్కచేయకుండా పని చేయాల్సిందే. సహజత్వం కోసం ఎంతో కష్టపడుతుంటారు. అలా తెర వెనక పడ్డ కష్టాన్ని ఫొటోల రూపంలో బయటపెట్టారు అదాశర్మ.

Adah Sharma : షూటింగ్‌ స్పాట్‌లో దెబ్బలతో.. ఫొటోలు వైరల్‌

సినిమా షూటింగ్‌ అంటే తారలు ఎండా, వాన, వేడి, చలి లెక్కచేయకుండా పని చేయాల్సిందే. సహజత్వం కోసం ఎంతో కష్టపడుతుంటారు. అలా తెర వెనక పడ్డ కష్టాన్ని ఫొటోల రూపంలో బయటపెట్టారు అదాశర్మ(adah Sharma). ఆమె కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala story) సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వివాదాల మధ్య ఈ మే 5న విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా కోసం ఎండలో ఎంతగా కష్ట పడింతో చూపించారు అదాశర్మ. ‘ది కేరళ స్టోరీ’ చిత్రీకరణ సమయంలో షూటింగ్‌ స్పాట్‌లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది.

‘‘మైనస్‌ 16 డిగ్రీల వాతావరణంలో 40 గంటలు పని చేశాం. దీంతో డీ హైడ్రేషన్‌ కారణంగా నా పెదవులె మొత్తం పగిలిపోయాయి. ఈ ఫొటోలో నా వెనకున్న పరుపు నేను రాళ్లల్లో కిందపడే సమయానికి కింద వేద్దామనుకున్నారు. కానీ దాన్ని మేము ఉపయోగించలేదు. దీంతో నా మోకాళ్లు, మోచేతులు కొట్టుకుపోయాయి. అయితే కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. అందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ అదా శర్మ పోస్ట్‌ చేశారు. (shooting photos Viral)

2.jpg

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా అదాశర్మ డెడికేషన్‌కు ఫిదా అయి ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మీపై మరింత గౌరవం పెరిగింది అని కామెంట్లు చేస్తున్నారు.

సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో హిందీ తెరకెక్కిన ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. కేరళ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని నిషేదించారు. ఇండియాలో సినిమా సాధించిన సక్సెస్‌ను బట్టి 40 దేశాల్లో విడుదల చేశారు. మొత్తం మీద ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రూ.237 కోట్లు వసూళ్లు రాబట్టింది.

Updated Date - 2023-06-02T18:53:50+05:30 IST