Citadel Team: మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం!

ABN , First Publish Date - 2023-06-09T14:46:22+05:30 IST

సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లపైనా దృష్టి పెట్టారు సమంత. రాజ్‌, డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌’ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడు. తాజాగా ఈ సిరీస్‌ టీమ్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు.

Citadel Team: మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం!

సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లపైనా దృష్టి పెట్టారు సమంత (Samantha). రాజ్‌, డీకే దర్శకత్వంలో (Raj and Dk) ‘సిటాడెల్‌’ (Citadel)సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడు. తాజాగా ఈ సిరీస్‌ టీమ్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును (Droupadi Murmu) కలిశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి సెర్బియా (Serbia) పర్యటనలో ఉన్నారు. సిటాడెల్‌ షూటింగ్‌ కూడా ఆ ప్రాంతంలోనే జరుగుతోంది. దీంతో సిటడెల్‌ టీమ్‌ రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫొటోలను వరున్‌ ధావన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రాష్ట్రపతిని కలిేస అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇది టీమ్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Untitled-1.jpg

దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే కూడా దీనిపై ట్వీట్‌ చేశారు. ‘‘గౌరవనీయులైన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. కాసేపు మాతో ముచ్చటించారు. కామెడీ సినిమాలంటే ఇష్టమని చెప్పారు. సిటాడెల్‌’ యాక్షన్‌ సిరీస్‌. అయినా, ఈ వెబ్‌ సిరీస్‌ను చూసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ టీమ్‌ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇంగ్లిష్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను ఇండియన్‌ వెర్షన్‌లో తెరకెక్కిస్తున్నారు.

Updated Date - 2023-06-09T14:50:05+05:30 IST