#SidharthKiaraWedding: ‘నీకు ఆలియాతోనే రాసి పెట్టుంది’.. కొత్త జంటపై మీమ్ వైరల్

ABN , First Publish Date - 2023-02-08T11:02:50+05:30 IST

బాలీవుడ్ క్రేజీ కపుల్ కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.

#SidharthKiaraWedding: ‘నీకు ఆలియాతోనే రాసి పెట్టుంది’.. కొత్త జంటపై మీమ్ వైరల్
Sidharth Malhotra

బాలీవుడ్ క్రేజీ కపుల్ కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వీరి మధ్య రహస్య ప్రేమాయణం నడుస్తోంది. ఈ తరుణంలో పెళ్లిని కూడా చాలా రహస్యంగా చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ‘షేర్‌షా’ (SherShah) సినిమా సమయంలో ఏర్పడిన పరిచయంతో ప్రేమికులుగా మారిన ఈ జంట మంగళవారం (ఫిబ్రవరి 7) జరిగిన పెళ్లి బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌ జైసల్మేర్‌ లోని సూర్యగర్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బాలీవుడ్‌ నుంచి అతికొద్ది మంది సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

అయితే.. ఈ జంట పెళ్లి విషయం తర్వాత వారికి ఈ జంటపై మీమ్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అందులో ఓ మీమ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో..

‘సిద్ధార్థ్ మల్హోత్రాతో పంతులు: మీ జాతకం ప్రకారం మీకు ఆలియాతో పెళ్లవుతుంది.

(అలియా భట్, కియారా అడ్వాణీ ఫొటోలు)

సిద్ధార్థ్: ఏ ఆలియాతో’ అని అందులో సరదాగా రాసుకొచ్చారు.

ఈ మీమ్ వైరల్ కావడానికి కారణం కియారా అసలు పేరు ఆలియా అడ్వాణీ కావడమే. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రముఖులు సూచన మేరకు కియారాగా మార్చుకుంది. అయితే గతంలో ఆలియా భట్‌తోనూ సిద్ధార్థ్ ప్రేమాయణం నడిపినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. దీంతో ఈ మీమ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా.. కియారా, సిద్ధార్థ్ బంధం గురించి ఎన్ని వార్తలు వచ్చినా ఈ జంట ఎప్పుడూ వారి ప్రేమ గురించి బయట పడలేదు. కానీ తొలిసారిగా ఓ టాక్‌ షోలో కియారా తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది. అప్పటి నుంచి వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-02-08T11:21:05+05:30 IST