Khal Nayak: చోళీ కె పీచ్ క్యా హై పాట తెలుసు కదా, ఆ సినిమా మళ్ళీ విడుదలవుతోంది... ఎప్పుడంటే...

ABN , First Publish Date - 2023-08-23T16:22:49+05:30 IST

సంజయ్ దత్, మాధురి దీక్షిత్, జాకీ ష్రాఫ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఖల్ నాయక్' మళ్ళీ విడుదలవుతోంది. ఈ సినిమాకి దర్శక, నిర్మాత అయిన సుభాష్ ఘాయ్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో చెప్పారు. ఎప్పుడు విడుదలవుతోంది అంటే..

Khal Nayak: చోళీ కె పీచ్ క్యా హై పాట తెలుసు కదా, ఆ సినిమా మళ్ళీ విడుదలవుతోంది... ఎప్పుడంటే...
Madhuri Dixit from Khal Nayak

సంజయ్ దత్ (SanjayDutt), జాకీ ష్రాఫ్ (JackieShroff), మాధురి దీక్షిత్ (MadhuriDixit) నటించిన 'ఖల్ నాయక్' #KhalNayak సినిమా 30 సంవత్సరాల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సుభాష్ ఘాయ్ (SubhashGhai) దర్శకుడు, నిర్మాత కూడా. మొన్న ఆగష్టు 6 వ తేదీకి ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. (Khal Nayak completed 30 years) ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే ఈ సినిమాని మళ్ళీ విడుదల చెయ్యాలని అనుకున్నారు.

madhuri1.jpg

1993 లో ఒక యాక్షన్ డ్రామాగా విడుదలైన ఈ సినిమా చాల పెద్ద విజయం సాధించింది. ఇందులో మాధురి దీక్షిత్, సంజయ్ దత్ మధ్య వచ్చే సన్నివేశాలు, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అప్పట్లో అభిమానులను ఉర్రూతలూగించింది. అలాగే ఇందులో ఒక పాట కూడా 'చోళీ కె పీచే క్యా హై' (Choli Ke Peeche Kya Hai) అన్నది అప్పట్లో ఒక సంచలనం. ఆ పాట కొన్ని సంవత్సరాల పాటు అందరి నోటిలో నానింది, అలాగే ఎక్కడ చూసినా పాటనే వేసేవారు, అంత ప్రాచుర్యం పొందింది.

khalnayak1.jpg

ఈ సినిమా దర్శకుడు, నిర్మాత సుభాష్ ఘాయ్ ఒక ప్రకటనలో ఈ సినిమాని మళ్ళీ సెప్టెంబర్ 5 (Khal Nayak re-releasing on September 5) న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో మాధురి దీక్షిత్ తన ప్రతిభని చూపించింది అని, అత్యుత్తమ నటన కనపరిచింది అని చెప్పారు. ఈ సినిమా సంగీతపరంగా కూడా చాలా పెద్ద హిట్. అందుకనే ఇప్పటి ప్రేక్షకులకు చూపించాలని, అలాగే ఈ సినిమా అప్పుడు చూసినవాళ్లు కూడా మళ్ళీ చూసుకునేందుకు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5 న విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. అలాగే సెప్టెంబర్ 4 న ఈ సినిమా ప్రీమియర్ ముంబై లో ఉంటుందని, దానికి బాలీవుడ్ నుండి చాలామంది నటీనటులు వస్తారని అంటున్నారు.

Updated Date - 2023-08-23T16:22:49+05:30 IST