Sonusood: హీరోయిన్‌కు దోశలు వేస్తే.. ఆ హీరో అభిమానులు అసహనం!

ABN , First Publish Date - 2023-07-03T12:32:32+05:30 IST

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మంది సామాన్యులకు సాయం చేసి రియల్‌ హీరోగా నిలిచారు సోనూసూద్‌. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం సోనూ ‘రోడీస్‌ సీజన్‌ 19’ పనుల్లో బిజీగా ఉన్నారు.

Sonusood: హీరోయిన్‌కు దోశలు వేస్తే.. ఆ హీరో అభిమానులు అసహనం!

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మంది సామాన్యులకు సాయం చేసి రియల్‌ హీరోగా నిలిచారు సోనూసూద్‌(Sonu sood). ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఏదో ఓ పక్క ఆపన్నహస్తం అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సోనూ ‘రోడీస్‌ సీజన్‌ 19’ (Roadies 19)పనుల్లో బిజీగా ఉన్నారు. కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో జరుగుతోంది. ఇందులో రియా చక్రవర్తి (rhea chakraborty)కూడా ఉన్నారు.

ఆదివారం షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న అందరికీ దోశలు వేశారు. (Sonu made Dosas) అదే సమయంలో, అక్కడికి వచ్చిన నటి రియా చక్రవర్తి రాగా.. ‘మీకు ఏ దోశ కావాలి’ అని అడిగారు. ఆమె అడిగిన దోశ వేసి ఇచ్చారు. తదుపరి పూరి చేసి చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అయింది. అయితే ఇది గమనించిన సోనూ అభిమానులు ‘రోజురోజుకీ మీపై మాకు ఎంతో గౌరవం పెరుగుతుంది’ అని కామెంట్స్‌ చేశారు. అయితే వీడియో చూసి కొందరు సోనూపై మండిపడుతున్నారు. వారంతా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అభిమానులు. ‘సర్‌ మీరంటే మాకెంతో గౌరవం ఉంది. దయచేసి రియా చక్రవర్తికి దూరంగా ఉండండి, మీరు ఆమెకు టిఫిన్‌ రెడీ చేసి పెట్టడం మాకు నచ్చలేదు. ఆమె వల్లే సుశాంత్‌ మరణించాడు. అలాంటి భయంకర మహిళకు మీరు దూరంగా ఉండాలి’ అని నెటిజన్లు సూచించారు. 2020 జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా కొంతకాలం జైలులో ఉంది.

Updated Date - 2023-07-03T12:32:32+05:30 IST