Kriti sanon: ఎవరైనా ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి!

ABN , First Publish Date - 2023-11-28T14:13:30+05:30 IST

'మిమి’ (Mimi) సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు కృతీసనన్ (kriti sanon). ఈ అవార్డ్‌ వేడుకలో ఆమె అల్లు అర్జున్ (Allu arjun) ను కలిసి మాట్లాడారు. తగ్గేదేలే అంటూ 'పుష్ప' సిగ్నేచర్‌ ఫోజ్‌తో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

Kriti sanon: ఎవరైనా ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి!

'మిమి’ (Mimi) సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు కృతీసనన్ (kriti sanon). ఈ అవార్డ్‌ వేడుకలో ఆమె అల్లు అర్జున్ (Allu arjun) ను కలిసి మాట్లాడారు. తగ్గేదేలే అంటూ 'పుష్ప' సిగ్నేచర్‌ ఫోజ్‌తో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అదే వేదికపై మీడియాతో మాట్లాడుతూ.. బన్నీతో కలిసి నటించాలనుందనే కోరికను బయటపెట్టింది. తాజాగా ఇదే విషయంపై కృతి మరోసారి స్పందించింది. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించింది. ముంబైలో జరిగిన ఓ వేడుకలో ఆమె మాట్లాడుతూ "అల్లు అర్జున్‌ను మొదటిసారి జాతీయ అవార్డుల వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అతడు ప్రతిభ గల నటుడు. అంతే కాదు చాలా తెలివైన వ్యక్తి కూడా. తన నటనకు ఫిదా అయ్యి అభిమానిగా మారాను. బన్నీతో కలిసి పని చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నా. ఇది త్వరగా జరగాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. అయితే ఆమె ఇలా చెప్పడం ఇదే మొదటిసారి కాదు. కృతీకి జాతీయ అవార్డు వచ్చినందుకు అభినందిస్తూ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టగా.. దానికి ఆమె స్పందించి కృతజ్ఞతలు చెప్పారు. ‘మీతో కలిసి నటించాలని ఉంది’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Untitled-3.jpg

ప్రస్తుతం కృతీసనన్ నటిగానే కాకుండా నిర్మాతగానూ మారారు. తాజాగా ఆమె నిర్మిస్తున్న సినిమా గురించి చెబుతూ ‘మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలను తీయాలనుకుంటున్నా. ప్రస్తుతం నేను ప్రొడ్యూస్‌ చేస్తున్న ‘దో పత్తి’ మిస్టరీ థ్రిల్లర్‌. ఛాలెంజ్‌ విసిరే కథతో రూపొందుతోంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించడాన్ని గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పారు. ఆదిపురుష్‌ చిత్రంలో సీతగా నటించిన ఆమె ప్రస్తుతం నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. షాహిద్‌ కపూర్‌తో కలిసి కృతీ ఓ రొమాంటిక్‌ లవ్‌స్టోరీలో నటిస్తోంది. అందులో షాహిద్‌ సైంటిస్ట్‌, మీరు రోబోగా కనిపించనున్నారట కదా అన్న ప్రశ్నకు 'ఆ చిత్రం గురించి ఇప్పుడు మాట్లాడకూడదు’ అంటూ జారుకున్నారు. అమిత జోషి, ఆరాధన షా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.

Updated Date - 2023-11-28T15:15:03+05:30 IST