Khushi Kapoor: రీమేక్‌తో కథానాయికగా!

ABN , First Publish Date - 2023-05-26T16:40:29+05:30 IST

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్‌ కథానాయికగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే! బాలీవుడ్‌లో పలు చిత్రాలతో కథానాయికగా నిరూపించుకున్న ఆమె జూనియర్‌ ఎన్టీఆర్‌ 30వ చిత్రం ‘దేవర’తో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం కానుంది.

Khushi Kapoor: రీమేక్‌తో కథానాయికగా!

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్‌ కథానాయికగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే! బాలీవుడ్‌లో పలు చిత్రాలతో కథానాయికగా నిరూపించుకున్న ఆమె జూనియర్‌ ఎన్టీఆర్‌ 30వ (NTR30)చిత్రం ‘దేవర’(Devara)తో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ (Khushi kapoor)వంతు వచ్చింది. ఆమె కూడా కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆమె ‘ది ఆర్చీస్‌’ చిత్రంలో నటించారు. తాజాగా మెయిన్‌ హీరోయిన్‌గా ఖుషీ సైన్‌ చేశారు. సౌత్‌లో సూపర్‌ హిటైన ‘లవ్‌టుడే’(Love today remake)ను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారు. అందులో హీరోయిన్‌గా ఖుషీ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమీర్‌ఖాన్‌ తనయుడు జువైద్‌ ఖాన్‌ కూడా తెరంగేట్రం చేస్తున్నాడు.

తమిళంలో రూ.5 కోట్ల బడ్జెత్‌తో రూపొందిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకొని రూ.100కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను దర్శకుడు అద్వైత్‌ చందన్‌ (Advait Chandan)హిందీలో భారీ బడ్జెట్‌తో రీమేక్‌ చేయనున్నారు. ఈ సినిమాతో ఇద్దరు స్టార్‌ కిడ్స్‌ బాలీవుడ్‌కు పరిచయం కావడం విశేషం. సుహానా ఖాన్‌తో కలిసి ఖుషీ నటించిన ‘ది ఆర్చీస్‌’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఖుషీ కపూర్‌ సినిమాల్లోకి రావడంపై బోనీ కపూర్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘శ్రీదేవి మరణించే సమయానికి ఖుషీకి 16 ఏళ్లు. ఆమె ఇండస్ర్టీలోకి వస్తుందని మేమిద్దరం అనుకోలేదు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన ఆశయమని ఖుషీ చెప్పింది’’ అని బోనీ కపూర్‌ అన్నారు.

Updated Date - 2023-05-26T16:40:29+05:30 IST