Keerthy Suresh: వరుణ్ ధావన్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమాకి రెడీ అవుతోంది

ABN , First Publish Date - 2023-09-25T12:28:39+05:30 IST

నయనతార హిందీలో 'జవాన్' సినిమాతో పెద్ద విజయం సాధించిన తరువాత, ఇంకో నటి కీర్తి సురేష్ ఇప్పుడు హిందీలో ఆరంగేట్రం చేస్తోంది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ అతని పక్కన చేస్తోంది, ఇది తమిళ సినిమా 'తెరి' కి రీమేక్. తమిళ దర్శకుడు కలీస్ ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సినిమా 'తెరి' దర్శకుడు అట్లీ ఈ హిందీ రీమేక్ నిర్మాతల్లో ఒకరు.

Keerthy Suresh: వరుణ్ ధావన్ తో  బాలీవుడ్ డెబ్యూ సినిమాకి రెడీ అవుతోంది
Keerthy Suresh

ఈమధ్య దక్షిణాదికి చెందిన నయనతార (Nayanthara) హిందీలో షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) పక్కన నటించి 'జవాన్' #Jawan సినిమాతో ఆరంగేట్రం చేసి పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు ఇంకో నటీమణి కీర్తి సురేష్ (KeerthySuresh) హిందీలో ఆరంగేట్రం చేయబోతోంది. ఆమె వరుణ్ ధావన్ (VarunDhawan) పక్కన నటిస్తోంది. తమిళ సినిమా 'తెరి' #Theri హిందీలో రీమేక్ చేస్తున్నారు, దాంట్లో కీర్తి సురేష్ ఒక కథానాయికగా నటిస్తోంది. ఆసక్తికరం ఏంటంటే 'జవాన్' తో హిట్ కొట్టిన దర్శకుడు అట్లీ (Atlee), ఈ 'తెరి' తమిళ సినిమాకి దర్శకుడు. అందుకే ఇప్పుడు ఈ హిందీ రీమేక్ సినిమాకి అతను నిర్మాతల్లో ఒకడుగా వున్నాడు, మురాద్ ఖేతని (MuradKhetani) ఇంకో నిర్మాత.

keerthysuresh4.jpg

'తెరి' సినిమాలో విజయ్ (ThalapathyVijay) కథానాయకుడు కాగా, ఇద్దరు కథానాయకులు సమంత రుత్ ప్రభు (Samahta), అమీ జాక్సన్ (AmyJackson) వున్నారు. ఇప్పుడు హిందీలో ఈ సినిమా రీమేక్ అవుతోంది, ఇందులో సమంత పాత్రని కీర్తి సురేష్ చేస్తోంది. తమిళ దర్శకుడు కలీస్ (Kalees) ఈ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇప్పుడు షూటింగ్ చెయ్యడం కోసం సమాయత్తం అవుతోంది. అందుకే కీర్తి సురేష్ ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళుతోంది.

varundhawan.jpg

వరుణ్ ధావన్ ఇంతకు ముందు 'సిటాడెల్' #Citadel అనే హిందీ వెబ్ సిరీస్ చేసాడు, దానికి రాజ్ & డికె (Raj&DK) దర్శకులు కాగా, అందులో సమంత కథానాయిక. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదలవుతుంది అని అంటున్నారు. నయనతార, కీర్తి సురేష్ కాకుండా, సాయి పల్లవి (SaiPallavi) కూడా హిందీలో డెబ్యూ చెయ్యడానికి రెడీ అవుతోంది.

Updated Date - 2023-09-25T12:29:37+05:30 IST