Kartik Aaryan: ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌కు నిర్మాతగా మారిన హీరో

ABN , First Publish Date - 2023-01-09T16:42:07+05:30 IST

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ‘షెహజాదా’ (Shehzada) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కార్తిక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

Kartik Aaryan: ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌కు నిర్మాతగా మారిన హీరో

బాలీవుడ్‌లో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’, ‘లవ్ అజ్ కల్ 2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ‘భూల్ భూలయ్యా 2’ (Bhool Bhulaiyaa 2) బంపర్ హిట్‌తో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ మంచి జోరు మీద ఉన్న దశలో ఈ యంగ్ హీరో నిర్మాతగా మారనున్నాడని తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ‘షెహజాదా’ (Shehzada) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కార్తిక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ యంగ్ హీరో అనివార్య కారణాల వల్ల నిర్మాతగా మారాల్సి వచ్చిందట. ‘షెహజాదా’ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఎవరైనా నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకు రాకపోతే సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. చిత్రాన్ని కాపాడాలని కార్తిక్ ఆర్యన్ నిర్ణయించుకున్నాడు. రెమ్యూనరేషన్ వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. అప్పటి వరకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.. కార్తిక్ ఆర్యన్‌ను ప్రాజెక్టులో నిర్మాతగా చేరాలని కోరారు. దీంతో ఈ మూవీలో భాగం కావడానికీ కార్తిక్ ఆర్యన్ అంగీకరించాడు. ‘షెహజాదా’ కు రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. మేకర్స్ త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇక కార్తిక్ ఆర్యన్ కెరీర్ విషయానికి వస్తే.. ఫ్రెడ్డీ‌ సినిమాలో చివరగా నటించాడు. ‘ఆషికీ 3’ లోను హీరో పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది.

Updated Date - 2023-01-09T16:42:09+05:30 IST