Janhvi Kapoor: కపూర్ సిస్టర్స్ నాలుగిళ్ళు అమ్మేశారు, ఎందుకంటే...

ABN , Publish Date - Dec 25 , 2023 | 02:27 PM

బోనీ కపూర్, అతని ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు తమకి చెందిన నాలుగు అపార్ట్మెంట్స్ ని ఈమధ్యనే అమ్మేశారని బాలీవుడ్ లో వార్త వైరల్ అయింది. ఇంతకీ ఎందుకు అమ్మేశారు అంటే...

Janhvi Kapoor: కపూర్ సిస్టర్స్ నాలుగిళ్ళు అమ్మేశారు, ఎందుకంటే...
Khushi Kapoor and Janhvi Kapoor

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ (Khushi Kapoor) ముంబై లో తమకి చెందిన నాలుగిళ్ళు అమ్మేశారని ఇప్పుడు వార్త వైరల్ అవుతోంది. ఈ నాలుగిళ్ళు ఈ ఇద్దరు చెళ్లెళ్లకి తమ తల్లి స్వర్గీయ శ్రీదేవి (Sridevi) నుండి వచ్చాయని అంటున్నారు. అయితే ఇందులో తండ్రి బోనీ కపూర్ (Boney Kapoor) కి కూడా వాటా వున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నాలుగు అపార్ట్మెంట్స్ ఈమధ్యనే అమ్మేసినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతకీ ఎందుకు వీటిని ఇలా అమ్మాల్సి వచ్చింది అంటే...

janhvikapoorkhushikapoor.jpg

ఆ నాలుగిళ్ళు చాలా సంవత్సరాల నుండీ వాడటం లేదని తెలిసింది. అవి ఖాళీగా ఉన్నాయని, అందులో కొన్ని అద్దెకు ఇచ్చారని, కొన్ని అద్దెకు ఇవ్వలేదని, అందుకనే వాటిని అమ్మేసినట్టుగా తెలిసింది. ఈ నాలుగు అపార్ట్మెంట్స్ కలిపి మొత్తం రూ.12 కోట్లకు అమ్మినట్టుగా తెలుస్తోంది. జాన్వీ కపూర్ ఇప్పుడు సినిమాలు చేస్తూ తాను కూడా సొంతగా ఆదాయం సమకూర్చుకుంటోంది, అలాగే ఈమధ్యనే చెల్లెలు ఖుషీ కపూర్ కూడా ఆరంగేట్రం చేసింది. నెట్ ఫ్లిక్స్ నిర్మాతగా 'ఆర్చీస్' #Archies అనే సినిమా ఈమధ్యనే ఓటిటి లో విడుదలయింది, ఈ సినిమాలో ఖుషీ కపూర్ నటించింది, మంచి మార్కులు కూడా పడ్డాయి ఆమెకి.

ఇలా ఈ ఇద్దరూ ఇప్పుడు వ్యక్తిగతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం, ఆ నాలుగు అపార్ట్మెంట్స్ ఖాళీగా ఎందుకు ఉండటం అని ఇద్దరు అక్కాచెల్లెళ్లు, బోనీ కపూర్ అవి అమ్మేసి వేరే దగ్గర ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బోనీ కపూర్ స్వయంగా చెప్పినట్టుగా కూడా చాలా మీడియాలో కథనాలు వచ్చాయి.

Updated Date - Dec 25 , 2023 | 02:27 PM