Kangana ranauth: నేను కిందకు పడిపోవాలనుకునేవాళ్లే ఎక్కువ!

ABN , First Publish Date - 2023-01-22T13:42:36+05:30 IST

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. తను కీలక పాత్ర పోషిస్తున్న ‘ఎమర్జెన్సీ’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆమె స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కంగనా ఎంతగానో కష్టపడుతున్నట్లు చెప్పారు.

Kangana ranauth: నేను కిందకు పడిపోవాలనుకునేవాళ్లే ఎక్కువ!

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut).. తను కీలక పాత్ర పోషిస్తున్న ‘ఎమర్జెన్సీ’ (emergency)చిత్రం షూటింగ్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆమె స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కంగనా ఎంతగానో కష్టపడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. టీమ్‌ సమక్షంలో సెట్‌లో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ‘‘నటిగా ఈరోజుతో ‘ఎమర్జెన్సీ’ షూట్‌ ముగించాను. నా జీవితంలో ఓ అద్భుత ఘట్టమిది. ఈ జర్నీ అంత సాఫీగా సాగలేదు. అందరూ చాలా సులభంగా జరిగింది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ సినిమా కోసం నా ఆస్తులు తనఖా పెట్టాను. ఇలా ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. నాకు అందుబాటులో ఉన్న ఏ వనరుని వదలకుండా ఉపయోగించుకున్నా. తొలి షెడ్యూల్‌ ప్రారంభంలోనే డెంగ్యూ ఫీవర్‌ రావడంతో కొంత గ్యాప్‌ తీసుకోవలసి వచ్చింది. నేను కిందక పడిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. అయినా ధైర్యంగా ముందుకెళ్లా. నన్ను బాధపెట్టడానికి చాలా విషయాల్లో నన్ను అడ్డుకుంటున్నారు. నా వెనుక కుట్రలు చేస్తున్నారు. నా బాధ వల్ల వచ్చే ఆనందాన్ని వారికి ఇవ్వకూడదు అనుకున్నాను. ఇది నాకు పునర్జన్మ లాంటిది. మునుపెన్నడూ లేనంతగా గొప్పగా అనిపిస్తుంది. ఇది సాధ్యం కావడానికి, నా కల నిజం కావడానికి నా చిత్ర బృందానికి నా ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (anupam kher)కంగనా పోస్ట్‌పై స్పందించారు.

‘‘డియర్‌ కంగనా నువ్వు రాసిన లేఖ ఎంతో స్ఫూర్తిగా ఉంది. నా హృదయాన్ని తాకింది. నేను సినిమాల్లోకి రాకముందు మా తాత నాకొక లేఖ రాశారు. అందులో ‘తడిసి ముద్ద అయిన వ్యక్తి భారీ వర్షానికి భయపడడు’ అని అందులో రాశారు. మీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మీ నిజాయతీ మీ బలం. ఇలా ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండండి. దేవుడి ఆశీసులు మీకుంటాయి’’ అని అనుపమ్‌ఖేర్‌ స్పందించారు.

Updated Date - 2023-01-22T13:42:38+05:30 IST