Janhvi Kapoor: ‘దాని గురించి ఎవరూ మాట్లాడరు.. అందరికీ ఇదే కావాలి’

ABN , First Publish Date - 2023-02-09T15:00:17+05:30 IST

అందాల తార, దివంగత నటి శ్రీదేవి (Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతోంది.

Janhvi Kapoor: ‘దాని గురించి ఎవరూ మాట్లాడరు.. అందరికీ ఇదే కావాలి’
Janhvi Kapoor

అందాల తార, దివంగత నటి శ్రీదేవి (Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతోంది. అయితే, గతకొంతకాలంగా బాలీవుడ్‌లో నెపోటిజం (nepotism) గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరణ్ జోహార్, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ వంటి తారలతో పాటు జాన్వీకపూర్ ఈ విషయమై ఎక్కువగా విమర్శల పాలవుతూ ఉంటారు.

janhvi3.jpg

నెపోటిజం గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడింది. ‘‘నటన రాకుంటే ఎందుకు నటిస్తున్నావు. నెపోటిజం వల్లే ఇక్కడ ఉండగలుగుతున్నావని ఎవరైనా అంటే బాధేస్తుంది. ఎందుకంటే మేం చేసే పని కోసం ఎంత కష్టపడుతున్నామో ఎవరూ చూడట్లేదు. ఆరోగ్యకరమైన విమర్శలకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అయితే ఇలాంటివి నా మీద చాలా ప్రభావం చూపుతాయి. ఒకవేళా నేను ‘మిలీ’ బాగా నటించకపోతే, నటనని మెరుగుపరుచుకోమని ఎవరైనా చెబితే నేను వింటాను. ఆచరిస్తాను. అయితే కొందరు మాత్రం చెత్త పదాలు వాడి నా సంతోషాన్ని పొగొడుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకుల ఎవరు కూడా తటస్థంగా నా సినిమాని చూడటానికి రావడం లేదు. ప్రతిసారీ నాకు ఈ జీవితం సులభంగా దొరికిందని అంటూ ఉంటారు’’ అని చెప్పుకొచ్చారు.

janhvi2.jpg

Updated Date - 2023-02-09T15:09:53+05:30 IST