సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Janhvi Kapoor: తమిళ సినిమా చేయబోతోందంటూ వార్తలు.. అసలు నిజం చెప్పిన బోనీ కపూర్

ABN, First Publish Date - 2023-02-03T15:23:31+05:30

అందాల తార, దివంగత నటి శ్రీదేవి (Sridevi) తనయురాలిగా బాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). అనంతరం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు పొందింది.

Janhvi Kapoor
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందాల తార, దివంగత నటి శ్రీదేవి (Sridevi) తనయురాలిగా బాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). అనంతరం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు పొందింది. వరుసగా కథా ప్రాధాన్యం, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఈ భామ పలువురు దక్షిణాది (South India) స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుందని చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కార్తీ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా జాన్వీ తండ్రి బోనీ కపూర్ (Boney Kapoor) సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

బోనీ షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘ప్రియమైన మీడియా మిత్రులారా.. జాన్వీ కపూర్ ప్రస్తుతానికి ఏ తమిళ చిత్రాలకు కమిట్ కాలేదు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. దీని కోసమే ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను’ అని రాసుకొచ్చాడు.

అయితే.. టాలీవుడ్ హీరో ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబో తెరకెక్కనున్న ‘ఎన్‌టీఆర్ 30’ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మాత్రం బోనీ, జాన్వీ, ‘ఎన్‌టీఆర్ 30’ చిత్రబృందం కానీ స్పందించలేదు. కాగా.. జాన్వీ ప్రస్తుతం ‘బవాల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’, ‘దోస్తానా 2’ వంటి పలు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు.

Updated Date - 2023-02-03T15:26:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!