Boney Kapoor : తనకు ఎంత చెప్పినా వినలేదు.. అందుకే అలా!

ABN , First Publish Date - 2023-10-03T12:06:34+05:30 IST

బోనీ కపూర్‌ (Boney Kapoor) తన సతీమణి, దివంగత శ్రీదేవిని (Sridevi death) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2018లో బంధువుల కుటుంబంలో వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న కన్నుమూశారు. ఇటీవల బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మరణం గురించి మాట్లాడారు

Boney Kapoor : తనకు ఎంత చెప్పినా వినలేదు.. అందుకే అలా!

బోనీ కపూర్‌ (Boney Kapoor) తన సతీమణి, దివంగత శ్రీదేవిని (Sridevi death) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2018లో బంధువుల కుటుంబంలో వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న కన్నుమూశారు. ఇటీవల బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మరణం గురించి మాట్లాడారు ‘ స్క్రీన్ పై అందంగా, స్లిమ్‌గా కనిపించడం కోసం శ్రీదేవి తరచూ డైట్‌ చేస్తుండేది. ఆ విషయం పెళ్లయ్యాకే నాకూ తెలిసింది. ఉప్పు లేకుండా భోజనం తినొద్దని వైద్యులు వారించినా తను పట్టించుకోలేదు. దానివల్ల నీరసించి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి.

బీపీ సమస్యలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండమని వైద్యులు ఎంతగానో చెప్పారు. కానీ శ్రీదేవి సీరియస్‌గా తీసుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె మరణానంతరం దుబాయ్‌ పోలీసులు నన్ను ఒకరోజు పాటు విచారించారు. లై డిటెక్టర్‌ పరీక్షలు చేశారు. భారతీయ మీడియా నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగానే నన్ను అన్ని రకాలుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర లేదని దుబాయ్‌ పోలీసులు నిర్థారించారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత నటుడు నాగార్జున నన్ను కలిశారు. క్రాష్‌ డైట్‌ కారణంగా శ్రీదేవి ఓసారి సెట్‌లో కళ్లు తిరిగి పడిపోయిందని, ఆ సమయంలో ఆమె పన్ను కూడా విరిగిందని చెప్పారు’’ అని బోనీకపూర్‌ అన్నారు.

Updated Date - 2023-10-03T12:07:36+05:30 IST