Animal: రణబీర్ సినిమాకి ఐదు కట్స్, ఒక సన్నివేశం తీసేయాలని చెప్పిన సెన్సార్ బోర్డు

ABN , First Publish Date - 2023-11-29T17:43:10+05:30 IST

రణబీర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న నటిస్తున్న 'యానిమల్' సినిమాకి సెన్సార్ బోర్డు కట్స్ విధించటమే కాకుండా, ఒక సన్నివేశం కూడా తీసేయాలని చెప్పింది. సందీప్ రెడ్డి వంగ దీనికి దర్శకుడు.

Animal: రణబీర్ సినిమాకి ఐదు కట్స్, ఒక సన్నివేశం తీసేయాలని చెప్పిన సెన్సార్ బోర్డు
A scene from Animal

రణబీర్, రష్మిక మందన్న జంటగా, సందీప్ వంగా దర్శకుడిగా వస్తున్న 'యానిమల్' సినిమా డిసెంబర్ 1 న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి, ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాలో ఐదు కట్స్ చెప్పారని, అలాగే ఒక ఇంటిమేట్ సన్నివేశం కూడా తీసెయ్యమన్నారు అని తెలుస్తోంది.

ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే వైరల్ అయింది, ఈ సినిమాలో చాలా హింస ఉంటుంది అని కూడా అర్థం అయింది. ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు అంటే 18 ఏళ్ల లోపు పిల్లలు ఈ సినిమా చూడటానికి పనికిరాదు. అలాగే ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇంకా చాలామంది నటీనటులు వున్నారు.

animalcensorcertificate.jpg

ఇక సెన్సార్ ఈ సినిమాలో ఐదు కట్స్ చెప్పాయి, కొన్ని పదాలని పూర్తిగా మార్చేయాలని కూడా చెప్పారు. అలాగే విజయ్, జోయాల మధ్య వచ్చే ఇంటిమేట్ సన్నివేశాలను మార్పు చెయ్యాలని చెప్పారని తెలిసింది. అలాగే 'బ్లాక్', కాస్ట్యూమ్ లాంటి పదాలను మార్చాలని కూడా సెన్సార్ బోర్డు చెప్పినట్టుగా ఆ సర్టిఫికెట్ లో చూపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కూడా సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమా నిడివి కి వస్తే ఈ సినిమా 3 గంటల 23 నిముషాలు అని అంటున్నారు. ఇంత నిడివి వున్న సినిమా ఈమధ్యకాలంలో రాలేదనే చెప్పాలి. అప్పుడెప్పుడో పాత తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు ఇంత నిడివిలో వచ్చేవి, ఈమధ్య కాలంలో మాత్రం రాలేదనే చెప్పాలి.

Updated Date - 2023-11-29T17:43:17+05:30 IST