Amitabh Bachchan: ప్రారంభం రోజే తెలుసంటూ బిగ్‌బీ భావోద్వేగం!

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:58 PM

కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ అంటే గుర్తొచ్చే పేరు అమితాబ్‌ బచ్చన్‌. ఇప్పటి దాకా 14 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్‌ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా చివరి ఎపిసోడ్‌ ప్రసారం అయింది. ఈ షోకు వచ్చిన ప్రేక్షకులతోపాటు బిగ్‌బీ కూడా భావోద్వేగానికి గురయ్యారు.b

Amitabh Bachchan: ప్రారంభం రోజే తెలుసంటూ బిగ్‌బీ భావోద్వేగం!

కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) అంటే గుర్తొచ్చే పేరు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan). ఇప్పటి దాకా 14 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్‌ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా చివరి ఎపిసోడ్‌ ప్రసారం అయింది. ఈ షోకు వచ్చిన ప్రేక్షకులతోపాటు బిగ్‌బీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. లాస్‌ ఎపిసోడ్‌కు షీలా దేవి, షర్మిలా ఠాగూర్‌, విద్యాబాలన్‌, సారా అలీఖాన్‌ పాల్గొని సందడి చేశారు. ఈ తరుణంలో వేదికపై ప్రసారం చేసిన వీడియో చూసి అమితాబ్‌ భావోద్వేగానికి గురయ్యారు. కేబీసీ ప్రారంభం నుంచి వివిధ సందర్భాలను కలిపి ఓ ఏవీ తయారు చేశారు. ఆ వీడియో ప్లే చేయగానే అందరినీ ఆకట్టుకుంది.

‘మేము దేవుడిని చూడలేదు. కానీ, దేవుడి బిడ్డను చూశాం’ అంటూ అక్కడి ఆడియన్స్‌ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఈ రోజు గేమ్‌ చివరి ఎపిసోడ్‌. ఇక మళ్లీ ఇక్కడకు తిరిగి రాలేము. ఈ మాటలు చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది, ఇలాంటి రోజు వస్తుందని ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడే నాకు తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలున్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నా’’ అని అమితాబ్‌ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 

Updated Date - Dec 31 , 2023 | 12:05 AM