Akshay Kumar : పాత వివాదమే మళ్లీ తెరపైకి.. అక్షయ్‌ క్లారిటీ!

ABN , First Publish Date - 2023-10-10T19:25:31+05:30 IST

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay kumar) పాన్ మసాలా  ప్రకటన ఎంతగా దూమారం లేపిందో తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆ ప్రకటనలు చేయడం మానేశారు. తాజాగా మరోసారి ఆ విషయం తెరపైకి వచ్చింది.

Akshay Kumar : పాత వివాదమే మళ్లీ తెరపైకి.. అక్షయ్‌ క్లారిటీ!

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay kumar) పాన్ మసాలా  ప్రకటన ఎంతగా దూమారం లేపిందో తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆ ప్రకటనలు చేయడం మానేశారు. తాజాగా మరోసారి ఆ విషయం తెరపైకి వచ్చింది. ఆయన మళ్లీ పాన్ మసాలా యాడ్స్‌ చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలో ఆయన నటించిన పాన్ మసాలా యాడ్‌ను పలువురు నెట్టింట షేర్‌ చేశారు. ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో అక్షయ్‌కుమార్‌ స్పందించారు. (Pan masala)

‘‘ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రకటన 2021 అక్టోబర్‌లో చిత్రీకరించినది. అగ్రిమెంట్‌ ప్రకారం దీన్ని 2023 నవంబర్‌ వరకు ప్రసారం చెయొచ్చు. అంతే కానీ, ఇప్పుడు నేను కొత్తగా ఏమీ చేయడం లేదు. నేను ఇలాంటి ప్రకటనల్లో నటించనని బహిరంగంగానే చెప్పాను. ఆ ప్రకటన తాలుక వివాదం తర్వాత మళ్లీ నేను అలాంటి యాడ్స్‌ చేయడం లేదు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’’ అంటూ పోస్ట్‌ చేశారు. ఆ యాడ్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగించానని ఆయన చెప్పారు. తాజాగా అక్షయ్‌ ‘ఓ మె ౖగాడ్‌ 2’, ‘మిషన్‌ రాణిగంజ్‌’తో విజయం అందుకున్నారు.

Updated Date - 2023-10-10T19:25:31+05:30 IST