RIP Akhil Mishra : త్రీ ఇడియట్స్‌ నటుడు ఇకలేరు!

ABN , First Publish Date - 2023-09-21T13:46:48+05:30 IST

బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. అమీర్‌ఖాన్‌ ‘త్రీ ఇడియట్స్‌’ (3 idiots) చిత్రంలో లైబ్రేరియన్‌ దుబే పాత్రతో మెప్పించిన ప్రముఖ నటుడు అఖిల్‌ మిశ్రా (58) గురువారం కన్నుమూశారు.

RIP Akhil Mishra : త్రీ ఇడియట్స్‌ నటుడు ఇకలేరు!

బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. అమీర్‌ఖాన్‌ ‘త్రీ ఇడియట్స్‌’ (3 idiots) చిత్రంలో లైబ్రేరియన్‌ దుబే పాత్రతో మెప్పించిన ప్రముఖ నటుడు అఖిల్‌ మిశ్రా (Akhil Mishra -58) గురువారం కన్నుమూశారు. వంట గది ఏదో పని చేస్తుండగా కాలు జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించినట్లు బాలీవుడ్‌ మీడిమా నుంచి సమాచారం. ఆ సమయంలో ఆయన భార్య సుజానే ఓ షూట్‌ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు. అఖిల్‌ మరణవార్త తెలుసుకున్న ఆమె షాక్‌కి గురయ్యారు. హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి పయనమయ్యారు. ‘నా భాగస్వామి నన్ను వదిలేసి వెళ్లిపోయాడు, నా గుండె ముక్కలైంది’ అని కన్నీటి పర్యంతమవుతోంది.

Akhil-mishra.jpg

సినీరంగంతోపాటు టీవీ రంగంలోనూ మంచి గుర్తింను తెచ్చుకున్న అఖిల్‌ మిశ్రా.. డాన్‌, వెల్‌డన్‌ అబ్బా, హజారన్‌ ఖ్వైషేన్‌ ఐసీ. శిఖర్‌ వంటి చిత్రాల్లో నటించారు. ‘ 3 ఇడియట్స్‌ సినిమాలో లైబ్రేరియన్‌గా నటించి జనాలకు మరింత చేరువయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లో జన్మించిన ఈయన 1983లో మంజు మిశ్రను పెళ్లి చేసుకున్నారు. ఆమె 1996లో మరణించింది. తర్వాత 2009లో జెర్మన్‌ కథనాయిక సుజానే బెర్నర్ట్‌ను పెళ్లాడారు మిశ్ర.

Updated Date - 2023-09-21T14:04:13+05:30 IST