Rashmika Mandanna: రిషబ్ వైరల్ ట్వీట్.. పేరును ప్రస్తావించకుండా రష్మికకు కౌంటర్..
ABN , First Publish Date - 2022-12-31T20:24:15+05:30 IST
రష్మికకు, కాంతార (Kantara) సినిమా హీరో రిషబ్ శెట్టికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు గతంలో రూమర్స్ హల్చల్ చేశాయి. కానీ, అటువంటిదేమీ లేదని రష్మిక చెప్పింది. తమ మధ్య సత్సబంధాలు ఉన్నట్టు పేర్కొంది.
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’ (Kirik Party)తో వెండితెరపైకి రంగప్రవేశం చేసింది. అనంతరం పలు ఇండస్ట్రీస్లో మూవీస్ చేసి సౌతిండియాలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. రష్మికకు, కాంతార (Kantara) సినిమా హీరో రిషబ్ శెట్టికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు గతంలో రూమర్స్ హల్చల్ చేశాయి. కానీ, అటువంటిదేమీ లేదని రష్మిక చెప్పింది. తమ మధ్య సత్సబంధాలు ఉన్నట్టు పేర్కొంది.
‘కిరిక్ పార్టీ’ కి రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించాడు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందింది. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శుక్రవారంతో ఈ మూవీ విడుదలై ఆరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో రిషబ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘కిరిక్ పార్టీ సినిమా విడుదలై ఆరేళ్లు పూర్తయినప్పటికీ.. మీరు చేసిన సందడి, విజిల్స్ ఇప్పటికీ మా చెవుల్లో ప్రతి ధ్వనిస్తూనే ఉన్నాయి. మమ్మల్ని వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తున్నాయి. ఈ సంబరాల్లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని రిషబ్ తెలిపాడు. హీరో రక్షిత్ శెట్టి, చిత్ర నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్కు ట్యాగ్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ రష్మికకు మాత్రం ట్యాగ్ చేయలేదు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. రిషబ్, రష్మికకు మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
కిరిక్ పార్టీ సినిమాలో ఏ విధంగా అవకాశం వచ్చిందని రష్మికను అడగగా గతంలో ఆసక్తికరంగా స్పందించింది. ప్రొడక్షన్ హౌస్ పరంవా స్టూడియోస్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ‘‘ఫ్రెష్ ఫేస్గా ఓ మ్యాగజైన్పై నా ఫొటో ప్రచురితమయింది. ఆ పిక్ను చూసి ప్రొడక్షన్ హౌస్ నాకు సినిమాలో అవకాశం ఇచ్చింది’’ అని రష్మిక తెలిపింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార’ పై కూడా ఎప్పుడు తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. వేరే సినిమాలకు మాత్రం శుభాకాంక్షలు చెబుతూ పలు మార్లు పోస్ట్లు పెట్టింది. రిషబ్ కూడా ఆమెపై ఉన్న కోపాన్ని గతంలోనే పరోక్షంగా వెల్లడించాడు.