Allu Arjun: ‘పుష్ప-2’ అప్డేట్ ఏంటంటే..
ABN , First Publish Date - 2022-12-13T18:40:06+05:30 IST
‘పుష్ప-2’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదంటూ ఈ మధ్యనే అల్లు అర్జున్ అభిమానులు గీతా ఆర్ట్స్ ఎదుట ఆందోళన చేశారు. సినిమా షూటింగ్, తదితర విషయాలేమీ బయటకు చెప్పడం లేదని, తక్షణమే సినిమా అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘పుష్ప-2’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదంటూ ఈ మధ్యనే అల్లు అర్జున్ అభిమానులు గీతా ఆర్ట్స్ ఎదుట ఆందోళన చేశారు. సినిమా షూటింగ్, తదితర విషయాలేమీ బయటకు చెప్పడం లేదని, తక్షణమే సినిమా అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే బన్నీ అభిమానులకు ఇప్పుడు శుభవార్త అందింది. ‘పుష్ప-2’ చిత్రీకరణ మంగళవారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. అక్కడ షూటింగ్ పూర్తయ్యాక రామోజీ ఫిల్మ్ సిటీకి లొకేషన్ షిఫ్ట్ చేస్తారని బన్నీ సన్నిహితులు నుంచి సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 10 రోజులపాటు జరగనుందట. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్లోనూ ఓ షెడ్యూల్ ఉంది. అక్కడ అటవీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈ నెల 16న విడుదల కానున్న ‘అవతార్2’ చిత్రం ప్రదర్శించబోతున్న థియేటర్లలో ‘పుష్ప 2’ గ్లింప్స్ను ప్రదర్శిస్తారు.
రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రధారులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప’ మొదటి భాగం సాధించిన విజయంతో ‘పుష్ప2’పై భారీ అంజనాలు పెరిగాయి. దాంతో దర్శకుడు సుకుమార్ పార్ట్ 2 విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.