Naga Vamsi: అవతార్2 పై సెటైర్స్.. ట్రోల్స్ బారిన నిర్మాత..

ABN , First Publish Date - 2022-12-17T20:31:35+05:30 IST

సినీ ఇండస్ట్రీకి చెందినవారు లౌక్యంగా వ్యవహరిస్తుంటారు. ఆచి తూచి మాట్లాడుతుంటారు. తమకు సినిమాలు నచ్చకపోతే మౌనంగా ఉండిపోతారు. నచ్చిన చిత్రాలను ఆకాశానికి ఎత్తేస్తుంటారు.

Naga Vamsi: అవతార్2 పై సెటైర్స్.. ట్రోల్స్ బారిన నిర్మాత..

సినీ ఇండస్ట్రీకి చెందినవారు లౌక్యంగా వ్యవహరిస్తుంటారు. ఆచి తూచి మాట్లాడుతుంటారు. తమకు సినిమాలు నచ్చకపోతే మౌనంగా ఉండిపోతారు. నచ్చిన చిత్రాలను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఒకరు అవతార్ సినిమాపై సెటైర్స్ వేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫలితంగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ (Naga Vamsi). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘జెర్సీ’, ‘డీజే టిల్లు’, ‘స్వాతిముత్యం’ వంటి చిత్రాలను నిర్మించాడు. అతడు తాజాగా అవతార్ సినిమాపై సెటైర్స్ వేస్తూ సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘‘మెరైన్ బయాలజీ డాక్యుమెంటరీని వీక్షించాలని జేమ్స్ కామెరూన్ ఆదేశించాడు. అది 3డీలో విజువల్ వండర్‌గా రూపొందింది కాబట్టి మాస్టర్ క్రాఫ్ట్, బ్లాక్‌బాస్టర్ అని అందరు చెప్పాలి.. లేదంటే నావీ అంగీకరిందు’’ అని వ్యంగ్యంగా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌ను షేర్ చేయగానే నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘‘రీమేక్ సినిమాలు తీసే నువ్వు.. అవతార్ గురించి మాట్లాడుతున్నావా’’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ‘‘త్రివిక్రమ్.. హాలీవుడ్ సినిమా స్క్రిఫ్ట్స్‌ను కాపీ చేసినంత సులభం కాదు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయడం’’ అని మరో సోషల్ మీడియా యూజర్ తెలిపాడు. కొంత మంది రాయలేని విధంగా దారుణంగా కామెంట్స్ పోస్ట్ చేశారు.‘అవ‌తార్ 2’ పై అన‌వ‌స‌రంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి నాగవంశీ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.

Updated Date - 2022-12-17T20:32:58+05:30 IST