Harihara Veeramallu: ఔరంగజేబు ఆగయా!

ABN , First Publish Date - 2022-12-24T13:03:55+05:30 IST

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’(Harihara veeramallu). క్రిష్‌ దర్శకత్వం (Krish వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌(NiddhiAgarwal) కథానాయికగా నటిస్తున్నారు.

Harihara Veeramallu: ఔరంగజేబు ఆగయా!

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’(Harihara veeramallu). క్రిష్‌ దర్శకత్వం (Krish వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌(NiddhiAgarwal) కథానాయికగా నటిస్తున్నారు. ఎ.ఎం. రత్నం (A.M.Ratnam)సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ప్యాన్‌ ఇండియా స్థాయిల తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్‌ (bobby deol)ఈ చిత్రం ఔరంగజేబుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రీకరణలో పాల్గోవడం కోసం హైదరాబాద్‌లో దిగారు. సినిమాకు ఎంతో కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్‌ సెట్‌ను రూపొందించారు. పవన్‌ కళ్యాణ్‌, బాబీ డియోల్‌ మధ్య సాగే కీలక సన్నివేశాలను ఈ దర్బార్‌ సెట్‌లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్‌కి ఘన స్వాగతం పలుకుతూ ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం ప్రత్యేక వీడియో విడుదల చేసింది. అందులో ఆయన లుక్‌ ఆకట్టుకుంటోంది.

ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించి భారీ షెడ్యూల్‌ పూర్తి చేశారు. అంతకుముందు ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు ప్రీ-షెడ్యూల్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. దర్శకుడు క్రిష్‌ ఆలోచనకు జీవం పోయడానికి.. తోట తరణి మొఘల్‌ యుగాన్ని పునఃసృష్టి చేయడానికి శ్రమిస్తున్నారు.

Updated Date - 2022-12-24T13:03:56+05:30 IST