Korameenu: క్యూరియాసిటీని పెంచుతున్న ట్రైలర్
ABN , First Publish Date - 2022-12-21T23:13:40+05:30 IST
విజయవాడలో నేరస్థులకు సింహ స్వప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజు అలియాస్ సీతారామరాజు విశాఖపట్నం సిటీకి

ఆనంద్ రవి (Anand Ravi) హీరోగా.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీపతి కర్రి (Sripathy Karri) దర్శకత్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కొరమీను’ (Korameenu). ఈ సినిమా డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. స్టోరీస్ ఆఫ్ ఇగోస్ అనేది క్యాప్షన్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని యంగ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ట్రైలర్ విషయానికి వస్తే..
విజయవాడలో నేరస్థులకు సింహ స్వప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజు అలియాస్ సీతారామరాజు విశాఖపట్నం సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు అనే డైలాగ్తో కొరమీను ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ డైలాగ్ వచ్చే సమయంలోనే మీసాల రాజుగా యాక్టర్ శత్రు (Shatru) ఇంట్రడక్షన్ ఇచ్చారు. విశాఖకు వచ్చిన మీసాల రాజుకి మీసాలుండవు. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్ అవుతుంది. సీతారామరాజుకి అది పెద్ద సమస్యగా మారుతుంది. మరో వైపు విశాఖ నగరంలోని జాలరి పేటలో డ్రగ్స్కి సంబంధించిన గొడవ జరుగుతుంటుంది. ఆ కేసుని మీసాల రాజు టేకప్ చేస్తాడు. మరో వైపు జాలరి పేటలో ఉండే డాన్ కరుణ ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. ఈ పాత్రలో హరీష్ ఉత్తమన్ (Harish Uthaman) కనిపించారు. అలాంటి కరుణాకి రైట్ హ్యాండ్ కోటి పాత్రను ఆనంద్ రవి పోషించారు.
కరుణకి, కోటికి ఓ చిన్న గొడవ.. కోటి, మీనాక్షి ప్రేమికులు. కోటి ప్రేమ విషయం నచ్చని కరుణ అతనికి వారం రోజులు టైమ్ ఇచ్చి జాలరి పేటను విడిచిపోవాలని కండీషన్ పెడతాడు. పోలీస్ ఆఫీసర్ మీసాల రాజు.. జాలరి పేట డాన్ కరుణ.. లవర్స్ కోటి - మీనాక్షి మధ్య నడిచే కథే ‘కొరమీను’. మరి కరుణ ఇచ్చిన వార్నింగ్కి కోటి - మీనాక్షి భయపడ్డారా? మీసాల రాజు వీరి మధ్య ఏం చేశాడు అనే విషయం తెలియాలంటే కొరమీను సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.