Adivi Sesh: ‘గూఢచారి 2’ ను ప్రకటించిన హీరో.. ఆ రోజే లాంచ్..

ABN , First Publish Date - 2022-12-29T15:28:31+05:30 IST

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగి వ్యక్తి అడివి శేష్ (Adivi Sesh). కొత్త రకం కథలు, వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘క్షణం’, ‘ఎవరు’, ‘గూఢచారి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

Adivi Sesh: ‘గూఢచారి 2’ ను ప్రకటించిన హీరో.. ఆ రోజే లాంచ్..

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగి వ్యక్తి అడివి శేష్ (Adivi Sesh). కొత్త రకం కథలు, వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘క్షణం’, ‘ఎవరు’, ‘గూఢచారి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన గూఢచారి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రూ.6కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాలను పంచి పెట్టింది. ఈ నేపథ్యంలో గూఢచారికి సీక్వెల్‌ను రూపొందిస్తానని అడివి శేష్ గతంలోనే తెలిపాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

‘గూఢచారి 2’ (Goodchari 2)ను జనవరి 9న లాంచ్ చేస్తామని అడివి శేష్ తెలిపాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ముంబై, ఢిల్లీలో నిర్వహిస్తామని చెప్పాడు. ‘గూఢచారి 2’ కూడా స్పై థ్రిల్లర్‌గా రూపొందనుంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించనున్నాడు. మొదటి భాగంతో పోల్చుకుంటే రెండోది భారీగా, పెద్దదిగా ఉంటుందని శేష్ పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కలసి నిర్మించనున్నాయి. బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ వరుసగా ఆరు హిట్స్ కొట్టాడు. అందువల్ల ‘గూఢచారి 2’ పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను భారీ అంచనాలున్నాయి. ఇక అడివి శేష్ కెరీర్ విషయానికి వస్తే.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఓ మూవీని అడివి శేష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మించనుంది.

Updated Date - 2022-12-29T15:42:23+05:30 IST