Vishal : ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-08T18:29:41+05:30 IST
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. గత చిత్రం ‘వీరమే వాగై సూడుమ్’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. తెలుగులో ఈ సినిమాను ‘సామాన్యుడు’ పేరుతో విడుదల చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. గత చిత్రం ‘వీరమే వాగై సూడుమ్’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. తెలుగులో ఈ సినిమాను ‘సామాన్యుడు’ పేరుతో విడుదల చేశారు. తెలుగులో రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. ప్రస్తుతం విశాల్ (Vishal) పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’ లో నటిస్తున్నారు. పోలీస్ పాత్రలో డిఫరెంట్ మేకోవర్ తో రాబోతున్నాడు. తాజాగా మరో చిత్రంలో నటించేందుకు కమిట్ అయ్యారు విశాల్ (Vishal). సినిమా పేరు ‘మార్క్ ఆంటోనీ’. టైటిల్ తోనే ఆకట్టుకుంటున్న విశాల్ ఇందులో ఓ పెక్యులర్ పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. కీలక పాత్రలో ఎస్.జె.సూర్య (SJ Surya) నటించే ఈ మూవీకి కథ, దర్శకత్వం అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran). మినీ స్టూడియోస్ పతాకంపై నిర్మాత ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. కెమెరా అభినందన్ రామానుజం, సంగీతం జీవీ ప్రకాష్ కుమార్. హీరోయిన్ రీతూ వర్మ (Rithu Varma) తొలిసారి విశాల్ సరసన జత చేరింది. సునీల్ వర్మ, నిళల్గల్ రవి కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించే ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో సంప్రదాయ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మరి ఈ సినిమా విశాల్ (Vishal) కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.