సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయ్ ఆంటోనీ ‘రత్తం’ చిత్రం డబ్బింగ్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2022-04-24T19:54:58+05:30

ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ బ్యానరులో సీ.ఎస్‌ అముదన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రక్తం’. ఈ సినిమా డబ్బింగ్‌ పనులు పూజా కార్యక్రమంతో శనివారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్వదేశంలో షూటింగ్‌ పూర్తి చేసుకోగా, మరికొంత భాగాన్ని విదేశాల్లో షూట్‌ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే విదేశాలకు వెళ్ళనుంది చిత్ర బృందం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ బ్యానరులో సీ.ఎస్‌ అముదన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రత్తం’. ఈ సినిమా డబ్బింగ్‌ పనులు పూజా కార్యక్రమంతో శనివారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్వదేశంలో షూటింగ్‌ పూర్తి చేసుకోగా, మరికొంత భాగాన్ని విదేశాల్లో షూట్‌ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే విదేశాలకు వెళ్ళనుంది చిత్ర బృందం. ఇందులో విజయ్‌ ఆంటోనీతో పాటు మహిమా నంబియార్‌, నందితా శ్వేత, రమ్యా నంబీశన్‌ హీరోయిన్లుగా, నిళల్‌గల్‌ రవి, జాన్‌ మహేంద్రన్‌, కలైరాణి, మహేష్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. గోపి అమర్నాథ్‌ చాయాగ్రహణం అందించగా, కన్నన్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.



Updated Date - 2022-04-24T19:54:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!