సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bharathi Raja : ఆసుపత్రిలో చేరిన దర్శక దిగ్గజం

ABN, First Publish Date - 2022-08-24T20:09:00+05:30

ఎనభయ్యవ దశకంలో తమిళనాట తన చిత్రాలతో సంచలనం సృష్టించారు దర్శకుడు భారతీరాజా (Bharathiraja). ‘కొత్త జీవితాలు’ (Kothajeevithalu) చిత్రంతో టాలీవుడ్ లోనూ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనభయ్యవ దశకంలో తమిళనాట పలు చిత్రాలతో సంచలనం సృష్టించారు దర్శకుడు భారతీరాజా (Bharathiraja). ‘కొత్త జీవితాలు’ (Kothajeevithalu) చిత్రంతో టాలీవుడ్ లోనూ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సీతాకోకచిలుక’ (Sithakokachiluka), చిరంజీవి (Chiranjeevi) తో ‘ఆరాధన’ (Aradhana), సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తో ‘జమదగ్ని’ (Jamadagni) లాంటి చిత్రాలు తెరకెక్కించి ఇక్కడ కూడా సత్తా చాటుకున్నారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం రెండేళ్ళ క్రితం వచ్చిన ‘మీండుమ్ ఒరు మరియాదై’ (Meendum Oru Mariyadai). అందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు.  ప్రస్తుతం దర్శకత్వాన్ని పక్కన పెట్టి.. పలు చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు భారతీరాజా. 


అలాంటి దర్శక దిగ్గజం.. మంగళవారం హఠాత్తుగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కడుపు నొప్పి తీవ్రంగా బాధించడంతో టి.నగరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి సూచించారు. దీంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. కాగా ఆయన పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘తిరుచిత్రాంబళం’ (Thiruchitrambalam) చిత్రంలోనూ ఆయన హీరో ధనుష్‌ (Dhanush) కు తాతగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. 

Updated Date - 2022-08-24T20:09:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!