Surya - Karthi: హిట్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

ABN , First Publish Date - 2022-05-12T19:01:30+05:30 IST

తమిళ స్టార్ హీరోలు సూర్య - కార్తి కలిసి ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటించబోతున్నారా..అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అవుననే వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి.

Surya - Karthi: హిట్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

తమిళ స్టార్ హీరోలు సూర్య (Surya) - కార్తి (Karthi) కలిసి ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటించబోతున్నారా..అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అవుననే వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. కోలీవుడ్ మెగా బ్రదర్స్ అనే పేరు సంపాదించుకున్న వీరిద్దరు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నారు. ఈ సోదరులిద్దరి సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సూర్య - కార్తిలకు టాలీవుడ్‌లోనూ అభిమానులు ఏర్పడ్డారు. 


అయితే, ఎప్పటి నుంచో సూర్య - కార్తి కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కార్తి హీరోగా నటించిన ఖైదీ (khaidi) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ వచ్చి మంచి వసూళ్ళగ్ రాబట్టింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేశారు. ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagraj) ఈ సీక్వెల్ మూవీకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలు పెట్టాడట.


కోలీవుడ్ మీడియా వర్గాల ద్వరా అందుతున్న సమాచారం మేరకు ఖైదీ సీక్వెల్ సినిమాలో సూర్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నారట. కథానుసారం ఒక పాత్ర కీలకంగా ఉంటుందట. దీనికోసం సూర్యను సంప్రదించగా..ఆయన కూడా దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా 'విక్రమ్' (Vikram) సినిమా రూపొందుతోంది. జూన్ 3 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత సూర్య - కార్తిలతో ఖైదీ సీక్వెల్ మూవీని సెట్స్ మీదకు తీసుకువస్తారట. త్వరలో దీనిపై అఫీషీయల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం.

Updated Date - 2022-05-12T19:01:30+05:30 IST