అక్క విడాకులు.. ప్రొఫైల్ పిక్ మార్చేసిన చెల్లెలు
ABN, First Publish Date - 2022-01-18T16:57:22+05:30
గత రాత్రి తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
గత రాత్రి తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత వారి వివాహ బంధానికి స్వస్తి పలికింది ఈ జంట. ఈ విషయాన్ని ఈ యువ నటుడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
అందులో.. ‘స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా 18 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం. ఈ ప్రయాణం ఎన్నో విషయాలను నేర్పింది. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. మా ప్రైవసీకి భంగం కలిగించకండి’ అంటూ రాసుకొచ్చాడు.
అయితే ధనుష్ విడాకుల గురించి ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఐశ్వర్య చెల్లెలు సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్లో తన ప్రోఫైల్ పిక్ని మార్చేసింది. తండ్రితో రజనీకాంత్తో కలిసి ఈ అక్కచెల్లెళ్లు చిన్నప్పుడు దిగిన ఓ పిక్ని డీపీగా పెట్టుకుంది సౌందర్య. అయితే దీనిపై చాలా మంది నెటిజన్లు ఐశ్వర్యకి సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు. ఓ మహిళ నెటిజన్ ‘స్ట్రాంగ్గా ఉండండి సోదరి.. మీ సిస్టర్ని, ఆమె పిల్లలని, మీ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ట్వీట్స్ పెట్టారు.