సొంత యూ ట్యూబ్ ఛానల్ లాంచ్ చేసిన రష్మిక.. ఎక్స్ గురించి జవాబులివ్వనన్న నటి..
ABN , First Publish Date - 2022-03-11T00:18:00+05:30 IST
‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు రష్మిక మందన్న
‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు రష్మిక మందన్న. సోషల్ మీడియాలోను ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్, టాలీవుడ్లో వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్యనే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా రష్మిక మందన్న సొంత యూట్యూబ్ ఛానల్ను లాంచ్ చేసింది. మొదటి వీడియోను ఆ ఛానల్లో విడుదల చేసింది. ఈ వీడియోలో పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. కానీ, తన ఎక్స్కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులివ్వనని స్పష్టం చేసింది. ట్రావెలింగ్, యాక్టింగ్, డ్యాన్సింగ్ అంటే తనకు ఎందుకు ఇష్టమో రష్మిక వివరించింది.
‘పుష్ప’ సినిమా బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన్న శ్రీవల్లిగా కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. దీంతో ఆమె పాపులరిటీ సౌత్ నుంచి నార్త్కు పాకింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లను అనుసరించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఫలితంగా యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రేక్షకులకు టచ్లో ఉండాలని ఆమె భావిస్తోంది. సొంత యూట్యూబ్ ఛానల్ను లాంచ్ చేసింది. కొన్ని రోజుల క్రితమే క్రితమే కీర్తి సురేష్, రాశీ ఖన్నా సొంత యూట్యూబ్ ఛానల్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
రష్మిక బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ చిత్రంలో నటిస్తోంది. ‘గుడ్ బై’, ‘పుష్ప: ది రూల్’ చిత్రాల్లోనూ ఆమె కనిపించనుంది.