Nayanatara: మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో రానున్న నయనతార

ABN , First Publish Date - 2022-12-06T15:16:43+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో నయనతార (Nayanthara) ఒకరు. సౌత్ ఇండస్ట్రీల్లో అయితే ఆమె అభిమానులు లేడీ సూపర్‌స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు...

Nayanatara: మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో రానున్న నయనతార

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో నయనతార (Nayanthara) ఒకరు. సౌత్ ఇండస్ట్రీల్లో అయితే ఆమె అభిమానులు లేడీ సూపర్‌స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రముఖ హీరోయిన్‌ నయనతార మరో సస్పెన్స్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకురానుంది. ‘కనెక్ట్‌’ (Connect) పేరుతో రూపొందిన ఈ చిత్రానికి అశ్విన్‌ శరణన్‌ దర్శకత్వం వహించారు. తమ సొంత బ్యానరు రౌడీ పిక్చర్స్‌ (Rowdy Pictures) పతాకంపై విగ్నేష్‌ శివన్‌ (Vignesh Shivan) నిర్మాతగా నిర్మించగా.. ఇందులో నయనతారతో పాటు బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌, నఫీసా హనియ కీలక పాత్రలు పోషించారు.


ఈ నెల 22న విడుదలకానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు సోమవారం నగరంలో విలేకరులతో మాటట్లాడుతూ.. ‘గతంలో నేను దర్శకత్వం వహించిన హర్రర్‌ చిత్రాలకే కాదు, ఇప్పటివరకు వచ్చిన ఈ జోనర్‌ చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో దెయ్యం పట్టిన కుమార్తెను వీడియో కాల్‌ ద్వారా  ఏ విధంగా నయం చేశారనే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఇది నయనతారను దృష్టిలో పెట్టుకుని కథ రాయలేదు. కథ సిద్ధమైన తర్వాత నయనతారను అప్రోచ్‌ కాగా.. ఆమె కథ విని ఒకే చెప్పారు. ఆ తర్వాత విగ్నేష్‌ శివన్‌కు స్టోరీ చెప్పగా, వారి సొంత బ్యానరులోనే నిర్మించేందుకు ముందుకు వచ్చారని వివరించారు.





Updated Date - 2022-12-06T15:16:43+05:30 IST