Manjima Mohan: పెళ్లి బంధంతో ఒకటైన కోలీవుడ్ జంట

ABN , First Publish Date - 2022-11-28T18:25:46+05:30 IST

నాగ చైతన్య, గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి మంజిమా మోహన్..

Manjima Mohan: పెళ్లి బంధంతో ఒకటైన కోలీవుడ్ జంట

నాగ చైతన్య, గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి మంజిమా మోహన్ (Manjima Mohan). అనంతరం తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్ యువనటుడు గౌతమ్ కార్తీక్‌ (Gautham karthik)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట కుటుంబ సభ్యుల అనుమతితో నవంబర్ 28న (నేడు) పెళ్లి బంధంతో ఒకటయ్యారు.  దీనిని మంజిమా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గౌతమ్‌తో పెళ్లికి సంబంధించిన పిక్‌ని షేర్ చేసిన మంజిమా దానికి ‘ప్రస్తుతం, ఎప్పటికీ’ అని రాసుకొచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొత్త జంటకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.


అయితే.. ‘దేవరట్టం’ అనే తమిళ సినిమాతో మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ కలిసి నటించారు. అదే సమయంలో వారిద్దరి మధ్యలో స్నేహం చిగురించింది. అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారింది. కాగా.. దాదాపు మూడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట తాజాగా వివాహబంధంతో ఒక్కటైంది.



Updated Date - 2022-11-28T18:25:46+05:30 IST