Vijay Kiragandur: ‘కాంతార’ కు త్వరలో రెండో భాగం!

ABN , First Publish Date - 2022-12-24T15:36:23+05:30 IST

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). రిషబే స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రేక్షకుల మెప్పు పొందడంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

Vijay Kiragandur: ‘కాంతార’ కు త్వరలో రెండో భాగం!

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). రిషబే స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాంతార సినిమాకు రెండో భాగాన్ని తెరకెక్కించాలనుకుంటున్నట్టు హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ (Vijay Kiragandur) తెలిపాడు.

‘కాంతార‌’ కు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు విజయ్ చెప్పాడు. ‘‘ప్రస్తుతం రిషబ్ ప్రయాణిస్తున్నాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత ప్రీక్వెల్ లేదా సీక్వెల్‌కు సంబంధించిన చర్చలు జరుపుతాం. ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాం. అందువల్ల కాంతార 2 ఎప్పుడు వస్తుందో చెప్పలేం’’ అని విజయ్ కిరంగదూర్ పేర్కొన్నాడు. కాంతార ఆస్కార్ రేసులో ఉన్నట్టు కూడా వెల్లడించాడు. ‘‘కాంతార‌ను ఆస్కార్స్‌కు పంపించాం. ఫైనల్ నామినేషన్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు’’ అని విజయ్ స్పష్టం చేశాడు. ఇక కాంతార విషయానికి వస్తే.. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి రికార్డులను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకుంది. కర్ణాటకలో ‘కెజియఫ్’ నెలకొల్పిన అనేక రికార్డులను ఈ సినిమా చెరిపేసింది. ఐఎమ్‌డీబీ‌లో అత్యధిక రేటింగ్‌ను సాధించిన చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. ‘కెజియఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’ లను బీట్ చేసి ఆ రికార్డును కొల్లగొట్టడం విశేషం.

Updated Date - 2022-12-25T14:53:08+05:30 IST